Type Here to Get Search Results !

May-10

May-10 Current affairs articles

కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్‌ అల్వరాడో 
Event-Date:10-May-2018
Level:International
Topic:Persons in News
కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్‌ అల్వరాడో  2018 మే 8న ప్రమాణ స్వీకారం చేశారు. జర్నలిస్టు అయిన కార్లోస్‌ అల్వరాడో  2018 ఏప్రిల్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్యాబ్రిసియో అల్వారాడో మునోజ్‌పై విజయం సాధించాడు.
-------------------------------------------------------------------------------------------
వరల్డ్‌ రెడ్‌క్రాస్‌ రెడ్‌ క్రెసెంట్‌ డే 

ప్రపంచవ్యాప్తంగా 2018 మే 8న వరల్డ్‌ రెడ్‌క్రాస్‌ రెడ్‌ క్రెసెంట్‌ డేను నిర్వహించారు. 2018 వరల్డ్‌ రెడ్‌క్రాస్‌ రెడ్‌ క్రెసెంట్‌ డే థీమ్‌ - Memorable smiles from around the world 
మహేంద్ర చౌదరికి వి.కె.కృష్ణ మీనన్‌ అవార్డు

ఫిజి ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి మహేంద్ర చౌదరి వి.కె.కృష్ణమీనన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. మహేంద్ర చౌదరి ఫిజిలో లేబర్‌ పార్టీకి చెందిన నాయకుడు. 1999 మే 19న ఫిజి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా ఘనత సాధించాడు. హర్యానాకు చెందిన మహేంద్ర చౌదరి పూర్వీకులు 1902లో ఫిజికి వలస వెళ్లారు.  
ఫేస్‌బుక్‌ టీంలో తొలిసారి భారీ మార్పులు

ఫేస్‌బుక్‌  సంస్థ  తొలిసారిగా మేనేజ్‌మెంట్‌ టీంలో భారీ మార్పులు చేర్పులు చేసింది. దాదాపు 12మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌ పదవుల్లో మార్పులు చేసింది. ఇంజనీరింగ్‌, ప్రొడక్ట్‌ టీమ్స్‌ను మూడు యూనిట్లుగా విడదీసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన  డేటా గోప్యతా కుంభకోణం తరువాత  నాయకత్వ బృందంలో మార్పులు  చేసినట్టు ఫేస్‌బుక్‌  తెలిపింది.
  • ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌,  మెసెంజర్‌ యాప్‌ లాంటి  ప్రధాన విభాగాలకు  కొత్త వారిని నియమించింది.
  • బ్లాక్‌చెయిన్‌ టూల్‌ను తిరిగి ప్రారంభించింది.
  • సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మునుపటిలాగానే సీఈవోగా కొనసాగుతారు.  సీఈవో  తర్వాత రెండవ అతి కీలకమైన ఎగ్జిక్యూటివ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా షెరిల్‌ సాండ్‌బర్గ్‌ ఉంటారు.
  • జుకర్‌బర్గ్‌ సర్కిల్‌లో దీర్ఘకాల సభ్యుడు, చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న క్రిస్‌ కాక్స్‌కు సంస్థ ప్రమోషన్‌ ఇచ్చింది. ఇకపై క్రిస్‌ ఫేస్‌బుక్‌ యాప్‌, స్మార్ట్‌ఫోన్‌సేవలు, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌,  మెసెంజర్‌ యాప్‌లకు ప్రధాన ఇన్‌చార్జ్‌గా  బాధ్యతలు నిర్వహిస్తారు.  
  • జేవియర్‌ ఆలివాన్‌ సోషల్‌ ప్రొడక్ట్‌ సర్వీసెస్‌ విభాగ నిర్వహణ  బాధ్యతలను చేపడతారు.
  • బిట్‌ కాయిన్‌కోసం బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని  పునరుద్ధరించింది.
  • మెసెంజర్‌ చాట్‌ యాప్‌కు చెందిన  డేవిడ్‌ మార్కస్‌  దీనికి నాయకత్వం వహిస్తారు.
  • న్యూస్‌ ఫీడ్‌ మాజీ హెడ్‌ ఆడమ్‌ మోస్సేరిని  ఫోటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు (కెప్టెన్‌ కెవిన్‌ వీల్‌ స్థానంలో) నియమించింది.
  • వాట్సాప్‌ కో ఫౌండర్‌ జాన్‌ కోమ్‌  రాజీనామా అనంతరం అతని స్థానంలో  క్రిస్‌ డేనియల్స్‌ను నియమించింది.
  • ఒబామా  మాజీ పరిపాలన అధికారి,  క్రేన్‌మేర్‌ గ్రూపు  చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అయిన జెఫ్‌ జింట్స్‌ను ఫేస్‌బుక్‌  బోర్డులోకి  చేర్చుకుంది.  
కాంగోలో మళ్లీ ఎబోలా 

అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కాంగోలో ఎబోలాతో 17 మంది మరణించారు. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ  ప్రకటన విడుదల చేసింది. మరోమారు ఎబోలా మహమ్మారి వ్యాపించిందని ప్రకటించింది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
  • బికోరో పట్టణం సమీపంలోని ఓ కుగ్రామంలో 21 మంది కొద్దిరోజుల క్రితం ఎబోలా వ్యాధి లక్షణాతో ఆస్పత్రిలో చేరారు. వారికి ఎబోలా వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి బారిన పడిన వారిలో 17 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.
  • కాంగో దేశంపై ఎబోలా వైరస్‌ దాడి చేయడం ఇది తొమ్మిదోసారి. 1970లో మొదటిసారి దీన్ని గుర్తించారు. ఎబోలా వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తుంది. రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ తీవ్రంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించింది. దాదాపు 28,600 మందికి ఈ వైరస్‌ సోకింది. 11,300 మంది మరణించారు.
  • ఎబోలా వైరస్‌ గబ్బిలం లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపించింది.
ఫోర్బ్స్‌ ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో జిన్‌పింగ్‌కు ప్రథమ స్థానం
Event-Date:10-May-2018
Level:International
Topic:Persons in News

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులతో కూడిన ఫోర్బ్స్‌ జాబితాలో చైనా అధ్యక్షుడు ప్రథమ స్థానంలో నిలిచారు.
  • గత నాలుగేళ్లుగా ప్రథమ స్థానంలో ఉంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అధిగమించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నారు.
  • ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోడికి 9వ స్థానం దక్కింది.  
  • ప్రపంచ గతిని మార్చిన 75 మంది ప్రముఖులతో 2018 ఏడాదికి ఫోర్బ్స్‌ ఈ జాబితాను వెలువరించింది.
  • ఈ జాబితాలో మోడితో పాటు చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.
  • ఈ భూమ్మీద మొత్తం 7.5 బిలియన్ల మంది జీవిస్తున్నారు. అందులో ఈ 75 మంది ప్రపంచ గతిని మార్చారు. ప్రతి 100 మిలియన్ల మందికి ఒకరి చొప్పున ఈ ఏడాది అత్యంత శక్తిమంతుల జాబితాను రూపొందించాం అని ఫోర్బ్స్‌ వ్యాఖ్యానించింది.
  • భారత్‌లో మోదీకి ఆదరణ కొనసాగుతోందన్న ఫోర్బ్స్‌.. 2016 నాటి నోట్లరద్దు నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జియో సేవలు ప్రారంభించిన రిలయన్స్‌ భారత టెలీ మార్కెట్‌లో చవక టారిఫ్‌ యుద్ధానికి తెరతీసిందని పేర్కొంది.  
ర్యాంక్‌   పేరు
1    జిన్‌పింగ్‌, చైనా అధ్యక్షుడు
2    వ్లాదిమిర్‌ పుతిన్‌, రష్యా అధ్యక్షుడు
3.   డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు
4.   ఏంజెలా మెర్కెల్‌, ఛాన్స్‌లర్‌, జర్మనీ
9    నరేంద్రమోడి, భారత ప్రధాని
13    మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఫేస్‌బుక్‌ సీఈఓ
14    థెరిసా మే, బ్రిటన్‌ ప్రధాని
15    లీకెకియాంగ్‌, చైనా ప్రధాని
24    టిమ్‌ కుక్‌, యాపిల్‌ సీఈఓ
32    ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత 
40    సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ  
Paytmతో APSRTC ఒప్పందం

ఆన్‌లైన్‌లో బస్సు సీట్ల రిజర్వేషన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)తో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పేటీఎంతో రాజస్థాన్‌ రాష్ట్ర రవాణా సంస్థ, హిమాచల్‌ రోడ్డు రవాణా సంస్థ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 
  • Paytm వ్యవస్థాకుడు - విజయ్‌శేఖర్‌ శర్మ
  • Paytm ఏర్పాటు - 2010
  • Paytm ప్రధాన కార్యాలయం - నోయిడా
2018-19లో భారత వృద్ధి 7.4% :IMF
Event-Date:10-May-2018
Level:National
Topic:Economic issues

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.4 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనా వేసింది. ఆ తర్వాత ఇది మరింత పెరిగి 7.8 శాతానికి చేరే అవకాశం ఉందని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం ఇందుకు దోహదం చేయొచ్చని పేర్కొంది.
  • IMF ప్రధాన కార్యాలయం - వాషింగ్టన్‌ డి.సి.
  • IMF సీఈఓ - క్రిస్టినె గార్డె
IMF-International Monetary Fund 
ప్రపంచంలోనే తొలిసారిగా గర్భస్థ శిశువు గుండె చప్పుడు వినే ‘సునో’ పరికరం ఆవిష్కరణ 
Event-Date:10-May-2018
Level:Local
Topic:Science and Technology

ప్రపంచంలోనే తొలిసారిగా, డాప్లర్‌ సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండా గర్భస్థ శిశువు గుండె సవ్వడిని వినే పరికరాన్ని హైదరాబాద్‌ యువకులు ఆవిష్కరించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేసే కంపెనీలో పని చేసిన పవన్‌కుమార్‌, సాద్‌ మహ్మద్‌లు ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రెగ్నిటివ్‌ టెక్నాలజీస్‌ను స్థాపించారు. ప్రస్తుతం గర్భస్థ శిశువు గుండె చప్పుడు వినడానికి అల్ట్రా సౌండ్‌తో పని చేసే పరికరాలను వినియోగిస్తున్నారని, వీటిని డాక్టర్ల సిఫారసు మేరకు 2-3 సార్లు మించి ఉపయోగించేందుకు వీలు లేదని కంపెనీ వ్యవస్థాపకులు పవన్‌ కుమార్‌, సాద్‌ మహ్మద్‌లు తెలిపారు.
  • తాము అభివృద్ధి చేసిన ‘సునో’ పరికరాన్ని యాప్‌తో మొబైల్‌కు అనుసంధానం చేసి, గుండె చప్పుడును ఎన్ని సార్లైనా వినొచ్చని, దీని నుంచి ఎటువంటి వంటి తరంగాలు విడుదల కావన్నారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇటువంటి పరికరాలపై అవగాహన ఉందని, సునోను త్వరలో విదేశీ మార్కెట్లలోకి కూడా విడుదల చేయనున్నామన్నారు. పరికరం ధర రూ.2,499 కాగా.. తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆఫర్‌ ధర కింద రూ.1,999కి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. 


ఆఫ్ఘాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దులో భూకంపం 
ఆఫ్ఘానిస్థాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దుల్లో పర్వత ప్రాంతంలో 2018 మే 9న భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 6.1గా నమోదయింది. భూకంపం తాలూకు ప్రకంపనలు డిల్లీ, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, జమ్ముకశ్మీరుకు వ్యాపించాయి. శ్రీనగర్‌లో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి వెలుపలికి పరుగులు తీశారు. 
ప్రయాణికుడికి రైలు ఎక్కిదిగేటప్పుడు జరిగే నష్టానికి పరిహారం పొందే హక్కు ఉంది : సుప్రీం
రైలు ఎక్కిదిగే క్రమంలో ఎప్పుడైనా మరణం సంభవించినా లేదా గాయపడినా సదరు ప్రయాణికుడికి పరిహారం పొందే హక్కు కచ్చితంగా ఉందని సుప్రీంకోర్టు 2018 మే 9న స్పష్టం చేసింది. అలాంటి సందర్భాలను ప్రయాణికుడి నిర్లక్ష్యంగా పరిగణించరాదని కూడా పేర్కొంది. రైల్వే ప్రాంగణంలో పడి ఉన్నంత మాత్రాన సదరు పరిహారం కోసం అభ్యర్థించే అర్హత ఉన్న ప్రయాణికుడిగా కూడా పరిగణించరాదని ఉద్ఘాటించింది. సదరు వ్యక్తి వద్ద రైలు టిక్కెట్‌ లేనంత మాత్రన పరిహారం పొందడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు/బాధితురాలు తమది నూటికి నూరుపాళ్లు అర్హత కలిగిన వాస్తవమైన అభ్యర్థనే అని నిరూపించే పత్రారైలును మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత మొత్తం సదరు పరిహారం కోసం అభ్యర్థించే వ్యక్తిపైనే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
పాన్‌కు దరఖాస్తు చేసుకునే ట్రాన్స్‌జెండర్లకు వెసులుబాటు
ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీ కింద శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)కు దరఖాస్తు చేసుకునే వారు జెండర్‌కు సంబంధించి ఎలాంటి పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ 2018 మే 9న స్పష్టం చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారితో పాటు పాన్‌ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేవారికి కూడా ఇది వర్తిస్తుంది.
  • ఇంతవరకూ పాన్‌ దరఖాస్తుల్లో స్త్రీ, పురుష కేటగిరీలను ఎంచుకునే అవకాశం మాత్రమే ఉండేది. తాజాగా ఐటీ శాఖ ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీని చేరుస్తూ ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పు చేసింది.
PAN-Permanent Account Number 
విజయ్‌ ప్రహార్‌ విజయవంతం 
రాజస్థాన్‌లో భారత సైన్యం నెల రోజుల పాటు భారీఎత్తున నిర్వహించిన ‘విజయ్‌ ప్రహార్‌’ కసరత్తు 2018 మే 9న ముగిసింది. 45 డిగ్రీ సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలో ఇసుక దుమారాల మధ్య సైనికుల సాయుధ హెలికాప్టర్లు, ట్యాంకు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో విన్యాసాలను ప్రదర్శించారు. జైపుర్‌ వాయువ్య కమాండ్‌కు చెందిన దాదాపు 25 వేలకు పైగా సైనికులు పాల్గొన్నారు. 
డిల్లీలో మొబైల్‌ డిజిటల్‌ మూవీ థియేటర్‌ ప్రారంభం 
Event-Date:10-May-2018
Level:National
Topic:Places in News
చలనచిత్ర ప్రదర్శన రంగంలో 2018 మే 9న సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ రాజధాని డిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతుల మీదుగా ‘‘మొబైల్‌ డిజిటల్‌ మూవీ థియేటర్‌’ ప్రారంభమైంది. సామాన్యుడికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వినోదం పంచేందుకే ఈ వినూత్న ప్రయోగం.
  • ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత సతీష్‌ కౌశిక్‌, పారిశ్రామికవేత్త సునీల్‌ చౌదరి కలిసి ‘పిక్చర్‌ టైం’ బ్రాండ్‌ పేరుతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.
  • ఓ కంటెయినర్‌, బెలూన్‌ లాంటి పెద్ద టెంటు సాయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 6030 అడుగుల వైశాల్యంలోఉండే ఈ తాత్కాలిక థియేటర్‌లో సుమారు 150 నుంచి 200 సీట్లు పడతాయి.  వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకొని నిలిచే మెటీరియల్‌ ఇందుకోసం వాడుతున్నారు. దీనిలో ఏసీ సదుపాయం కూడా ఉంది. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అప్పటికప్పుడు ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సినిమాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు దీంతో మేలు జరుగుతుంది. సినిమా స్థాయిని బట్టి టికెట్టు ధర రూ.30 నుంచి రూ.60వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 
తెలంగాణ అంతటా ‘మన కూరగాయలు’ పథకం
కూరగాయల చిల్లర ధరలు ఇష్టారాజ్యంగా పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ‘మన కూరగాయలు’ పథకాన్ని రాష్ట్రమంతా విస్తరించాలని తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. పథకం అమలుకు నూతన మార్గదర్శకాలతో 2018 మే 9న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 55 విక్రయ కేంద్రాలుండగా త్వరలో మరో 5 ప్రారంభించబోతున్నారు. ఇవే కాకుండా నగరంలోని 40 మెట్రోరైల్ స్టేషన్లలో ఈ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు మెట్రో రైల్ సంస్థతో మార్కెటింగ్‌ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది.  జీహెచ్‌ఎంసీలో వంద విక్రయ కేంద్రాల ఏర్పాటు అనంతరం ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌లో సైతం వీటి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పాత మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కూరగాయల సేకరణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
  • ఈ పథకం అమలుకు మార్కెటింగ్‌ శాఖనే నోడల్‌ ఏజెన్సీగా నియమించారు.
  • పొలాల దగ్గరే టోకు ధరలకు కొని, పంపిణీ కేంద్రాలకు తెచ్చి గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసి విక్రయ కేంద్రాల్లో రైతుబజారు ధరకు విక్రయించడం ఈ పథకం లక్ష్యం.
  • రోజూ బోయిన్‌పల్లి మార్కెట్‌ టోకు ధర ప్రకారం రైతుకు చెల్లించి కూరగాయలు సేకరిస్తారు. రైతుకు చెల్లించిన ధరకు 30 శాతానికి మించకుండా గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉండాలని నిర్ణయించారు.
  • రాష్ట్రంలో అంతగా పండని ఆలుగడ్డ, ఉల్లిగడ్డ వంటి కూరగాయలను బోయిన్‌పల్లి టోకు ధరకు కొని విక్రయిస్తారు. వీటికి కొరత ఏర్పడితే దేశంలో ఏ పెద్ద మార్కెట్‌ నుంచి అయినా తెచ్చుకోవచ్చు.
  • కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగితే వాటిని నియంత్రించడానికి రాష్ట్ర స్థాయి ‘మన కూరగాయల కమిటీ’ తగు నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీకి మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు.
  • వరుసగా 5 రోజులు కూరగాయల ధర పెరుగుతూ పోతే వెంటనే ఈ కమిటీ స్పందించాలి. ప్రతిరోజు ధరను సమీక్షించాలి. అంతకుముందు రోజుకంటే 50 శాతంకన్నా ఎక్కువ పెరిగితే నియంత్రించేందుకు నిర్ణయాలు తీసుకోవాలి.
  • కూరగాయలు కోసిన తర్వాత ప్రజలకు అమ్మేలోగా అవి పాడవకుండా రైతులకు కోత అనంతర పద్ధతులపై శిక్షణ ఇస్తారు. 
  • ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ సహకారంతో కూరగాయల సాగు విస్తీర్ణానికి ఈ పథకం కింద రైతులను ప్రోత్సహిస్తారు. 
  • కూరగాయల సేకరణ, విక్రయాల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పోస్‌) యంత్రాల ద్వారానే చెల్లింపులు జరపాలి. 
  • మన కూరగాయలు విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలంటే కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో దుకాణం, దానిముందు వాహనాలు నిలపడానికి స్థలం ఉండాలి.
విజయ్‌ మాల్యా పరారీలో ఉన్న నిందితుడు : బ్రిటన్‌ హైకోర్టు
Event-Date:10-May-2018
Level:International
Topic:Persons in News

భారత్‌లోని బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర ఎగనామం పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యాకు చుక్కెదురైంది. బ్యాంకుల రుణ వసూలుకు వీలు కల్పించేలా ఆయన ఆస్తులను స్తంభింపజేస్తూ జారీ అయిన అంతర్జాతీయ ఉత్తర్వును అక్కడి హైకోర్టు సమర్థించింది. భారత్‌కు తనను అప్పగించకుండా మాల్యా న్యాయపరంగా పోరాడుతున్నప్పటికీ.. అతడిని ‘పరారీలో ఉన్న నిందితుడి’గా పరిగణించేందుకు ఆధారాలున్నాయని వ్యాఖ్యానించింది. 
యురేనియం శుద్ధిని తిరిగి ప్రారంభిస్తాం : ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ
అణు ఒప్పందం పూర్తిగా విచ్ఛిన్నమైతే యురేనియం శుద్ధి ప్రక్రియను తాము తిరిగి ప్రారంభించే అవకాశముందని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ హెచ్చరించారు. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో రౌహానీ 2018 మే 8న స్పందించారు. అమెరికా వైదొలిగినప్పటికీ ఆ ఒప్పందం అమల్లో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  


JCPOAకు కట్టుబడి ఉంటామని ఇరాన్‌ అణు ఒప్పంద  భాగస్వామ్య దేశాల ప్రకటన
ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (JCPOA) నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, చైనాలు విచారం, ఆందోళన వ్యక్తం చేశాయి. JCPOAకు కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. ట్రంప్‌ నిర్ణయాన్ని
  • ఇజ్రాయెల్‌, సౌదీలు స్వాగతించాయి.
  • భాగస్వామ్య పక్షాలు దౌత్యం, సంప్రదింపుల ద్వారా ఇరాన్‌ అణు సమస్యకు పరిష్కారం కనుగొనాలని భారత్‌ పునరుద్ఘాటించింది.
JCPOA-Joint Comprehensive Plan of Action 













Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.