May-11 Current affairs articles
చట్టబద్దంగా ట్రాన్స్జెండర్ల పెళ్లి
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Miscellaneous(General) |

- ఇషాన్, సూర్యలు ట్రాన్స్జెండర్ జస్టిస్ బోర్డులో కొన్నేళ్లుగా సభ్యులు. స్నేహితులు. వీరి వివాహం భారత్లో ఎప్పటినుంచో LGBT కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అవమానాల నుంచి విజయంగా భావిస్తున్నారు.
-------------------------------------------------------------------------------------------
ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలున్న నగరం లండన్
Event-Date: | 11-May-2018 |
Level: | International |
Topic: | Miscellaneous(General) |

- ఈ జాబితా రూపొందించడానికి యూనివర్సిటీ ర్యాంకింగ్, విద్యార్థుల అభిప్రాయాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగుల పనితీరు, ఫీజుల వివరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. భద్రతా ప్రమాణాలు, జనాభా, సాంఘిక అంశాలు, జనాదరణ వంటి అంశాల ఆధారంగా విద్యార్థులు యూనివర్సిటీలో చేరుతున్నారని క్యూఎస్ తన నివేదికలో పేర్కొంది.
- ఈ జాబితాలో లండన్ తర్వాత టోక్యో, మెల్బోర్న్, మాంట్రియల్, పారిస్, మ్యూనిచ్, బెర్లిన్, జ్యూరిచ్, సిడ్నీ, సియోల్లు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
- గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పిస్తున్న నగరాల జాబితాలోనూ లండన్ 2వ స్థానం సంపాదించుకుంది.
- యునైటెడ్ కింగ్డమ్లోని ఇతర నగరాలతో పోలిస్తే లండన్లో అద్దె ఖర్చులు నిలకడగా ఉంటాయని.. ప్రపంచంలోని టాప్-10 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నందున ఈ జాబితాలో లండన్ ప్రథమ స్థానంలో నిలిచిందని క్యూఎస్ తెలిపింది.
మలేసియా ప్రధానిగా మరోసారి మహతీర్
Event-Date: | 11-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

- ఎన్నిక ద్వారా అధికారంలోకి వచ్చినవారిలో ప్రపంచంలోనే అత్యంత వయోధికుడుగా మహతీర్ రికార్డు సృష్టించారు. ఈసారి ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తూ ఆయన బరిలోకి దిగారు. 1957లో స్వతంత్రదేశంగా అవతరించిన తర్వాత మలేసియాలో తొలిసారిగా ప్రతిపక్షాలు విజయం సాధించాయి. మలేసియాలో 6 దశాబ్దాలుగా బారిసన్ నాజినల్(బీఎన్) సంకీర్ణమే పాలనలో ఉంది. దేశాన్ని అధునాతంగా తీర్చిదిద్దిన పేరుతో పాటు, ఉక్కు పిడికిలితో పాలన సాగించినట్లు విమర్శలున్న మహాథిర్ 2003లో రాజకీయాల నుంచి తప్పుకొనేంత వరకు 22ఏళ్లు ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో ఆయన ఇదే సంకీర్ణానికి నాయకత్వం వహించారు. కాగా భారీ అవినీతి, ప్రత్యక్ష పన్నుల విధానం తదితర అంశాలు ఇంతవరకు ప్రధానిగా ఉన్న నజీబ్ రజాక్పై వ్యతిరేకతను పెంచాయి. వీటితో పాటు, ప్రతిపక్ష ప్రముఖుడు ఇబ్రహీం అన్వర్ను జైలులో పెట్టడం తదితర కారణాలతో ఆగ్రహించిన మహాథిర్ ప్రతిపక్షాతో కలిపి మళ్లీ బరిలోకి దిగారు.
- మహాథిర్ మాదిరిగానే పలు దేశాల్లో మళ్లీ మళ్లీ పదవుల్లోకి వచ్చిన నేతలున్నారు. బ్రిటన్లో విన్స్టన్చర్చిల్ 3 సార్లు పదవిలోకి వచ్చారు. 1915లో అనివార్య పరిస్థితుల్లో రాజీనామా చేసిన ఆయన 1940, 1951ల్లో ప్రధాని పదవిని చేపట్టారు. అలాగే 52 ఏళ్ల వయసులో 2006లో జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షింజోఅబే కుంభకోణాలు, రాజకీయ అసమ్మతితో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పదవిలోకి వచ్చారు. ఇటాలియన్ మీడియా దిగ్గజం బెర్లుస్కోనీ 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. ఇజ్రాయిల్లో యువ ప్రధానిగా 1996లో బాధ్యతలు చేపట్టిన బెంజమిన్ నెతన్యాహు తిరిగి 2009లో ప్రధాని అయ్యారు.
లైంగిక దాడుల బాధితుల పరిహారం పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలి : నల్సా
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

పతుల కేసులో బిడ్డకు న్యాయమూర్తి నామకరణం
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Persons in News |

కేంద్ర పథకాల ప్రచారానికి ‘కిసాన్ సంవాద్’
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Miscellaneous(General) |

అమెరికాలో OPT కింద అనుమతి పొందిన విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Foreign relations |

- 2వ స్థానంలో చైనా వారు, 3వ స్థానంలో దక్షిణకొరియా విద్యార్థులు నిలిచారు.
- 2004-2016 మధ్య OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కింద 4,41,000 మంది భారతీయ విద్యార్థులు పని చేసుకోవడానికి అనుమతి పొందారని, ఈ సంఖ్య.. మొత్తం విద్యార్థుల్లో 30 శాతమని ప్యూ రీసెర్చి తెలిపింది.
- OPT కింద అనుమతి పొందిన చైనా విద్యార్థులు 3,13,500 మంది (21శాతం), దక్షిణ కొరియా విద్యార్థులు 90,800 మంది (ఆరు శాతం).
- విదేశీ విద్యార్థులు ఎఫ్1 వీసా కింద 12 నుంచి 36 నెలల పాటు తాత్కాలికంగా పని చేసుకునేందుకు దొరికే అనుమతే OPT. అభ్యర్థులు తమ చదువుకు సంబంధించిన రంగంలోనే ఈ కార్యక్రమం కింద పని చేయాల్సి ఉంటుంది.
అటల్టింకరింగ్ ల్యాబ్స్ నవ కల్పన పోటీలో తెలంగాణ విద్యార్థులకు చోటు
Event-Date: | 11-May-2018 |
Level: | Local |
Topic: | Science and Technology |

- ఆరు నెలల పాటు నిర్వహించిన అటల్ టింకరింగ్ మారథాన్లోని విద్యార్థులు రూపొందించిన నవ కల్పనను వడపోసి అంతిమంగా ఎంపిక చేసిన 30 అత్యుత్తమ ఆలోచననలు పుస్తకరూపంలో 2018 మే 10న నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ విడుదల చేశారు. స్వచ్ఛ ఇంధనం, నీటివనరుల సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యం, వ్యవసాయ సాంకేతిక రంగాల్లో ఈ పోటీ నిర్వహించారు.
కెన్యాలో బద్దలైన ఆనకట్ట: 47 మంది మృతి
Event-Date: | 11-May-2018 |
Level: | International |
Topic: | Miscellaneous(General) |

పీసా హార్మ్యం గుట్టు రట్టు
Event-Date: | 11-May-2018 |
Level: | International |
Topic: | Places in News |

- ఈ మేరకు బ్రిటన్లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన వారు సహా మొత్తం 16 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉన్న భూకంప, భౌగోళిక, నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు.
- ఈ భవనం విషయంలో అసాధారణమైన ‘క్రియాశీల మట్టి నిర్మాణ ప్రతిస్పందనలు’ చోటుచేసుకున్నట్లు చెప్పారు.
- కట్టడం ఎత్తు, దృఢత్వం, పునాది మట్టిలో ఉండే మృదుత్వం కలిసి.. భూకంపం కారణంగా ఏర్పడిన ప్రకంపనల తీవ్రతను గణనీయంగా మార్చేస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల భూకంప ప్రకంపనలతో కట్టడం అనునాదం చెందడం లేదని, ఫలితంగా భవనం సురక్షితంగా ఉంటోందని వివరించారు.
స్విట్జర్లాండ్లో 104 ఏళ్ల ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ గూడాల్ బలవన్మరణం
Event-Date: | 11-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

- ఆత్మహత్యకు ముందురోజు 2018 మే 9న డేవిడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ఇంకొన్నాళ్లు బతికే కోరిక నాకు ఏమాత్రం లేదు. రేపు జీవితాన్ని ముగించే అవకాశమున్నందుకు చాలా సంతోషిస్తున్నా. ఆ అవకాశాన్ని నాకిస్తున్న వైద్యవృత్తిని అభినందిస్తున్నా. ఆస్ట్రేలియాలోనే చనిపోయేందుకు నేను మొగ్గుచూపేవాణ్ని. అక్కడి చట్టాలు అందుకు అనుమతించడం లేదు’’ అని పేర్కొన్నారు.
సియాచిన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Persons in News |

- జమ్ముకశ్మీర్లో సముద్రమట్టానికి 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ను సందర్శించిన రెండో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దివంగత ఏపీజే అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతిగా ఉండగా 2004లో ఇక్కడకు వచ్చారు.
నమోదిత కంపెనీ బోర్డుల్లో భారీ మార్పులకు సెబీ శ్రీకారం
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

- కంపెనీ బోర్డులో కనీసం ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలని, అందులో ఒక మహిళకు చోటు కల్పించడం తప్పనిసరి చేసింది.
- కొత్త మార్పులకు దశలవారీగా తుది గడువు విధించింది. స్వతంత్ర డైరెక్టర్ల ఏర్పాటుకు తుది గడువును 2019 ఏప్రిల్ 1గా సెబీ నిర్ణయించింది. సీఎండీ పదవి విడదీయడానికి 2020 ఏప్రిల్ 1 వరకు గడువు ఇచ్చింది.
- కార్పొరేట్ పరిపానపై ఉదయ్ కోటక్ ప్యానెల్ చేసిన 80 సిఫారసుల్లో 40 సిఫారసులకు మార్చిలో సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే సెబీ తాజా ఆదేశాలు జారీచేసింది. 2017 అక్టోబరులో ప్యానెల్ తమ నివేదికను సెబీకి సమర్పించింది.
- కొత్త నిబంధనల ప్రకారం.. నమోదిత కంపెనీలు, అనుబంధ సంస్థలు అన్ని రకాల లావాదేవీల వివరాలను తెలియజేయడంతో పాటు సెక్రటేరియల్ ఆడిట్ను సెబీ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అగ్రగామి 100 నమోదిత కంపెనీలు తమ వార్షిక సర్వసభ్య సమావేశాలను వెబ్కాస్ట్ ద్వారా ప్రసారం చేయాల్సిందిగా ఆదేశించింది. కొత్త నిబంధనలు రెండు దఫాల్లో అమల్లోకి రానున్నాయి. ఎక్కువ శాతం మార్పులు 2019 ఏప్రిల్ 1, 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సెబీ నోటిఫికేషన్లో పేర్కొంది.
- కొత్త నిబంధనల ప్రకారం 2020 ఏప్రిల్ 1 నుంచి అగ్రగామి 500 నమోదిత కంపెనీల్లో ఛైర్పర్సన్ తప్పనిసరిగా నాన్- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండాలి. ఈ నిర్ణయం ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవి విభజనకు దారితీయనుంది. ప్రస్తుతం చాలా కంపెనీల్లో సీఎండీగా ఒక్కరే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బోర్డు, మేనేజ్మెంట్ కంటే సీఎండీకి ఎక్కువ నిర్ణయాధికారం ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఆయాచిత బ్ధి చేకూర్చడానికి కారణమవుతోందని సెబీ భావిస్తోంది.
- 2019 ఏప్రిల్ 1కి అగ్రగామి 500 కంపెనీలు తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్ను నియమించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బోర్డుల్లో మహిళా డైరెక్టర్ ఉంటే చాు. వీరు స్వతంత్ర లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు.
- ఇకపై ఒక వ్యక్తి ఏడు నమోదిత కంపెనీల కంటే ఎక్కువ వాటిల్లో స్వతంత్ర డైరెక్టర్గా పనిచేయకూడదని సెబీ ఆదేశించింది.
- కంపెనీల్లో అకౌంటింగ్, ఆడిటింగ్ వ్యవహారాల్లోనూ సెబీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన సంస్థాగత మదుపర్లు, ప్రిఫరెన్షియల్ ఇష్యూ వంటి ద్వారా సమీకరించిన నిధుల వివరాలను వార్షిక నివేదికల్లో కంపెనీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిటర్ వివరాలు, ఆడిట్ ఫీజు, ఫీజుల్లో మార్పులు, ఆడిటర్ రాజీనామాకు సవివరమైన కారణాలను సైతం తెలియజేయాల్సి ఉంటుంది.
- ఆర్థిక సంవత్సరం ముగిసిన 5 నెలల్లో అగ్రగామి 100 కంపెనీలు ఏజీఎంను నిర్వహించాలి.
- 2019 ఏప్రిల్ 1 నుంచి అగ్రగామి 1000 కంపెనీ బోర్డు సమావేశాలకు ముగ్గురు డైరెక్టర్లు హాజరు కావడం తప్పనిసరి. 2020 ఏప్రిల్ నుంచి 2000 అగ్రగామి కంపెనీలకు ఇదే నిబంధన వర్తిస్తుంది.
- 75 ఏళ్ల పైబడిన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల నియామకానికి ప్రజా వాటాదార్ల ఆమోదం తెలపాలి.
- అగ్రగామి 500 కంపెనీల్లో సైబర్ భద్రతకు రిస్క్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఇక పెద్ద సంఖ్యలో అనుబంధ సంస్థలు కలిగిన నమోదిత కంపెనీలు.. బోర్డు డైరెక్టర్లతో కూడిన అత్యున్నత కమిటీ ద్వారా వాటి పరిపాలనను పర్యవేక్షించాల్సిందిగా సెబీ ఆదేశించింది.
మొక్కజొన్న, జొన్నకు క్వింటాలుకు రూ.200
Event-Date: | 11-May-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |

- 2018 మే 16 నుంచి రైతు నమోదు ప్రారంభమవుతుంది.
- మండల వ్యవసాయాధికారి ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రం, సాగు విస్తీర్ణం, దిగుబడి తదితర వివరాలను యాప్లో నమోదు చేసుకోవాలి. వీటిని వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది తమ వద్ద ఉండే అడంగల్ వివరాలతో సరిచూసుకుని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు.
- సమగ్ర పరిశీలన అనంతరం జిల్లా అధికారులకు, అక్కడ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు జాబితాలు చేరతాయి.
- 2018 జులై 10 నుంచి రైతు ఖాతాల్లో సొమ్ము జమ చేయడం ప్రారంభమవుతుంది.
అతిపెద్ద జెండాను ఆవిష్కరించిన పవన్ కల్యాణ్
Event-Date: | 11-May-2018 |
Level: | Local |
Topic: | Places in News |

- 1857 మే 10న తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు.
- వైబ్రంట్స్ కలాం ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఓర్వకల్లులో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన
Event-Date: | 11-May-2018 |
Level: | Local |
Topic: | Miscellaneous(General) |

ఉత్తర కొరియా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్లు విడుదల
Event-Date: | 11-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

న్యూయార్క్లో అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల సమావేశం
Event-Date: | 11-May-2018 |
Level: | International |
Topic: | Conferences and Meetings |

భారత్పై WTOలో అమెరికా ఫిర్యాదు
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Foreign relations |

- వ్యవసాయ ఒప్పందంపై ఒక దేశంపై మరో దేశం ఫిర్యాదు చేయడం ఇదే ప్రథమం.
రైతుబంధు పథకం ప్రారంభం
Event-Date: | 11-May-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |

15వ ఆర్థిక సంఘం సలహా మండలి ఏర్పాటు
Event-Date: | 11-May-2018 |
Level: | National |
Topic: | Economic issues |

ఆర్థిక సంఘం సలహా మండలి సభ్యులు
- అరవింద్ వీర్మణి, ప్రెసిడెంటు, ఫోరం ఫర్ స్ట్రాటెజిక్ ఇనిషియేటివ్
- సుర్జీత్ ఎస్.భల్లా, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలిలో తాత్కాలిక సభ్యుడు, ఆక్సుస్ రీసెర్చి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఛైర్మన్
- సంజీవ్ గుప్త, ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్
- పినాకి చక్రవర్తి, ప్రొఫెసర్ (ఎన్ఐపీఎఫ్ప్మీ)
- సజ్జద్ చినాయ్, చీఫ్ ఇండియా ఎకనామిస్ట్, జేపీమోర్గాన్
- నీలకంఠ మిశ్ర, ఎండీ, క్రెడిట్ సుయెస్సె ఇండియా ఎకనమిస్ట్, స్ట్రాటజిస్ట్
- 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ - ఎన్.కె.సింగ్ (నందకిశోర్సింగ్)
- 15వ ఆర్థిక సంఘం సభ్యులు :
2. ప్రొ॥ అనూప్సింగ్
3. అశోక్ లహిరి
3. ప్రొ॥ రమేష్ చంద్
4. అరవింద్ మెహతా