Type Here to Get Search Results !

మార్చి-2018 ఆర్థిక రంగం

మార్చి - 5
¤ ఖాతాదారుల వివరాల సేకరణ (కేవైసీ)కు సంబంధించి నిబంధనలను పాటించనందుకు రిజర్వ్‌బ్యాంక్ ప్రైవేట్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌కు రూ. 3 కోట్లు, ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 2 కోట్లు జరిమానా విధించింది.
మార్చి - 9
¤ దేశంలోని అన్ని బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) డిసెంబరు నాటికి రూ. 8,40,958 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా పరిశ్రమలకిచ్చిన రుణాలే ఉన్నాయి. ఆ తర్వాత మొండి బకాయిలు ఎక్కువగా ఉన్న రంగాల్లో సేవలు, వ్యవసాయాలున్నాయి. 2017, డిసెంబరు 31 నాటికి పరిశ్రమలకిచ్చిన రుణాల్లో మొండి బకాయిలు రూ.6,09,222 కోట్లగా ఉన్నాయి. స్థూల అడ్వాన్సుల్లో ఇవి 20.41 శాతంగా ఉన్నాయి. ఇక సేవల రంగం (రూ.1,10,520 కోట్లు - 5.77%); వ్యవసాయ అనుబంధ రంగాలు (రూ.69,000 కోట్లు - 6.53%); రిటైల్ విభాగం (రూ.36,630 కోట్లు - 2.01%)లలో కూడా మొండి బకాయిలు నమోదైనట్లు ఆర్థిక సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
మార్చి - 12
¤ బీఎస్ఈ సెన్సెక్ ఒక రోజులో అత్యధిక లాభంను నమోదు చేసింది. క్రితం రోజుతో పోలిస్తే 610.55 పాయింట్ల లాభాన్ని సాధించింది.
         »
 మార్చి 1, 2016న సెన్సెక్స్ పొందిన 777.35 పాయింట్ల ఒక రోజు లాభం తర్వాత వచ్చిన గరిష్ఠ లాభం ఇదే కావడం గమనార్హం.
మార్చి - 17
¤ భారతదేశం నుంచి 2016 - 17లో రూ.37,870.90 కోట్ల విలువైన 11,34,948 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతయ్యాయి.         » 2105 - 16తో పోలిస్తే ఎగుమతుల పరిమాణంలో 19.99 శాతం, విలువలో 24.49 శాతం వృద్ధి నమోదైంది.         » దేశం నుంచి అత్యధికంగా ఎగుమతైన సముద్ర ఉత్పత్తుల్లో రొయ్యలదే అగ్రస్థానం. మొత్తం 4,24,484 టన్నుల రొయ్యలు అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, చైనా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతయ్యాయి.         » మొత్తం ఎగుమతుల విలువలో 64.50 శాతం, పరిమాణంలో 38.28 శాతం రొయ్యలదే.         » మొత్తం ఎగుమతుల్లో అమెరికాకు వెళ్లిన వాటా 29.98 శాతం ఉండగా, రొయ్యల ఎగుమతుల్లో 94.77 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. ఆ తరువాత వియత్నాం, థాయ్‌లాండ్, తైవాన్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా దేశాలకు ఎగుమతయ్యాయి.         » ఏపీలోని విశాఖ పోర్టు నుంచే అత్యధికంగా రూ.9,294.31 కోట్ల విలువైన 1,59,973 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. రూ.4860.98 కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులతో కొచ్చిపోర్టు రెండో స్థానంలో, రూ.4451.67 కోట్లతో కోల్‌కతా పోర్టు మూడో స్థానంలోనూ నిలిచాయి.         » కృష్ణపట్నం పోర్టు నుంచి రూ. 3701.63 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
మార్చి - 20
¤ అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా అసూరెన్స్ దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆరోగ్య బీమా (మెడిక్లెయిమ్) పాలసీని తీసుకొచ్చింది.         » విదేశీ ఆసుపత్రుల్లో కేన్సర్, అవయవ మార్పిడి, ఎముక మజ్జ మార్పిడి వంటి ఆరు కీలక అనారోగ్యాలకు 0.5 - 2 మిలియన్ డాలర్లు (రూ.3.25 - 13 కోట్లు) వరకు కవరేజీ ఇస్తోంది.         » ఈ సేవలను అందించడం కోసం అంతర్జాతీయంగా 100 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ప్రకటించింది.         » 18-75 ఏళ్ల వయసు ఉండి ఆ ఆరు రోగాల ఛాయలు లేనివారు ఈ పాలసీని తీసుకోవచ్చు.¤ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ కోత వేసింది.         » పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వెలుగు చూసిన 2 మిలియన్ డాలర్లకు పైగా కుంభకోణమే ఇందుకు కారణమని వెల్లడించింది.         » 2018 - 19లో భారత జీడీపీ 8 శాతంగా ఉండొచ్చని ముందుగా అంచనా వేసిన గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా దాన్ని 7.6 శాతానికి కోత వేసింది.
మార్చి - 21
¤ దేశంలో మరో భారీ ఆర్థిక నేరం వెలుగు చూసింది. సుమారు రూ. వెయ్యి కోట్ల మేర బకాయిలను చెల్లించకుండానే బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం దేశం నుంచి పరారైంది. ఈ విషయమే కనిష్క్‌కు రుణాలిచ్చిన 14 బ్యాంకుల సహ వ్యవస్థకు నేతృత్వం వహించిన ఎస్‌బీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆశ్రయించింది.         » సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ప్రమోటర్ డైరెక్టర్ భూపేష్‌కుమార్ జైన్, డైరెక్టర్ నీతా జైన్, తదితరులను నిందితులుగా పేర్కొంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.