Type Here to Get Search Results !

Army Public School PGT TGT PRT recruitment notification-2020



టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యు్కేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) నోటిఫికేషన్‌

దేశవ్యాప్తంగా వివిధ కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యు్కేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తామని వెల్లడించింది.

అయితే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని సంబంధిత పాఠశాలలు వెల్లడిస్తాయని తెలిపింది.

దేశంలోని 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ (ఏపీఎస్‌)లో వీరిని నియమిస్తామని ప్రకటించింది.

మొత్తం పోస్టులు: 8000

అర్మతలు: పీజీటీకి బీఈడీతోపాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, టీజీటీ పోస్టులకు బీఈడీతోపాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, పీఆర్‌టీ పోస్టులకు బీఈడీ లేదా రెండేండ్ల డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాల. అభ్యర్థులు 40 ఏండ్లలోపువారై ఉండాలి. అనుభవం ఉన్నవారికైతే 57 ఏండ్ల వయస్సు ఉండాలి.

స్క్రీనింగ్‌ టెస్టుకు సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం:

ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌ ఎవాల్యుయేషన్‌

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌

అప్లికేషన్‌ ఫీజు: రూ.500

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 1

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 20

అడ్మిట్‌ కార్డులు: నవంబర్‌ మొదటి వారంలో

పరీక్ష తేదీ: నవంబర్‌ 21, 22

ఫలితాల విడుదల: డిసెంబర్‌ మొదటి వారంలో

వెబ్‌సైట్‌: http://aps-csb.in

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

» నోటిఫికేష‌న్:   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.