May-04
ఎస్సీ, ఎస్టీ తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Judiciary and Judgement |

- ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 కింద తక్షణ అరెస్టు నిబంధనలపై కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ సుప్రీంకోర్టు 2018 మార్చి 20న తీర్పు వెలువరించింది. తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును ధర్మాసనం సమర్థించుకుంది.
-------------------------------------------------------------------------------------------
శాప్ పాలకమండలి నియామకం
Event-Date: | 04-May-2018 |
Level: | Local |
Topic: | Sports and Games |

SAAP-Sports Authority of Andhra Pradesh
ఆస్ట్రేలియా జట్టు నూతన కోచ్ లాంగర్
Event-Date: | 04-May-2018 |
Level: | International |
Topic: | Sports and Games |

- బాల్ టాంపరింగ్ కుంభకోణం నేపథ్యంలో డారెన్ లీమన్ తప్పుకోవడంతో ఆసీస్ కోచ్ పదవికి ఖాళీ ఏర్పడింది.
- 47 ఏళ్ల లాంగర్ ఇంతకుముందు వెస్టర్న్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్స్ కోచ్గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
- ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45.27 సగటుతో 7696 పరుగులు చేశాడు.లాంగర్ 8 వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు.
వేలంలో ట్రంప్ నగ్న విగ్రహానికి రూ.18 లక్షలు
Event-Date: | 04-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

- గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ తీరుకు నిరసనగా ‘ఇన్డిక్లైన్’ అనే కళాకారుల బృందం ఇలాంటి 5 విగ్రహాలను రూపొందించి వివిధ నగరాల్లో ఏర్పాటు చేసింది.
- వీటిలో ధ్వంసం కాకుండా మిగిలిన చివరి విగ్రహాన్ని జులియన్స్ ఆక్షన్స్ సంస్థ తాజాగా వేలం వేసింది.
- ‘దెయ్యాల కోసం గాలిస్తూ’ టీవీ కార్యక్రమాలను రూపొందించే జాక్ బేగన్స్ అనే వ్యక్తి విగ్రహాన్ని కొనుగోలు చేశాడు.
చదువు, వ్యాపారం కోసం పింఛను సొమ్మును తీసుకోవచ్చు : PFDRA
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

- ప్రైవేటు ఉద్యోగుల ఈక్విటీల్లో పెట్టుబడులను ప్రస్తుతమున్న 50% నుంచి 75% వరకూ పెంచుకునేందుకూ వీలు కల్పించింది.
- 50 ఏళ్ల వయసు వచ్చేవరకూ ‘యాక్టివ్ ఛాయిస్’ కింద వీరు ఈ మేరకు మదుపు చేసుకోవచ్చు.
- ఈ ఛాయిస్ను యాక్టివేట్ చేసుకున్నవారు- ఈక్విటీలు, ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లతో పాటు ప్రత్యామ్నాయ పెట్టుబడుల నిధి కింద మరో 5% నిధులను మదుపు చేసుకోవచ్చు.
- మొత్తం కార్పొరేట్ బాండ్లలో ‘ఏ’ గ్రేడ్ బాండ్లు 10 శాతానికి మించకూడదని PFDRA నిర్ణయించింది. NPSతో పాటు అటల్ పింఛను యోజనను PFDRA పర్యవేక్షిస్తోంది.
PFDRA-Pension Fund Regulatory and Development Authority
ఉమాంగ్ యాప్లో పింఛను పాస్బుక్
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

EPFO-Employees' Provident Fund Organisation
కారుణ్య మరణం కొరకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త
Event-Date: | 04-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

- ఆస్ట్రేలియాలో కారుణ్య మరణం చట్టవిరుద్ధం కాగా విదేశీయులకు అనుమతించే ఏకైక దేశం స్విట్జర్లాండ్.
- లండన్లో జన్మించిన గుడాల్ పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్లో నివాసం ఉండేవారు.
- ఆయన ‘ఎకోసిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్’ అనే 30 పుస్తకాల సంపుటిని ఎడిట్ చేశారు.
- తన శాస్త్రీయ పరిశోధనలతో ప్రతిష్ఠాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’లో సభ్యత్వం కూడా పొందారు.
- పెర్త్లోని ఓ యూనివర్సిటీలో స్వచ్ఛందంగా పనిచేసే ఆయన తనను తొలగించడంతో 2016లో 102వ ఏట ఆ విశ్వవిద్యాలయంపై పోరాడి విజయం సాధించారు.
స్థాయీ సంఘం పరిశీలనకు చిట్ఫండ్ సవరణ బిల్లు
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

- చిట్ఫండ్ రంగానికి సంబంధించిన చట్టబద్ధ, నియంత్రణ, వ్యవస్థాగత నిబంధనలను సమీక్షించడం, ఆ రంగం క్రమబద్ధ అభివృద్ధి, సామర్థ్యం పెంపునకు సలహాలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాన్ని నియమించింది.
- ఆ బృందం సూచన మేరకు చిట్ ఫండ్ చట్టం-1982లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
- రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా చిట్ఫండ్ను ఏర్పాటు చేయకూడదన్నది ఈ సవరణల్లో ప్రధాన అంశం.
- చిట్ వేలం జరిగే సమయంలో ఇద్దరు చందాదారులు స్వయంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ తప్పనిసరిగా పాల్గొనేటట్టు చూడాలన్నది మరో సవరణ.
- చిట్ వేలంను తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది.
- చిట్ఫండ్ కంపెనీ యాజమాన్యం తరఫున వ్యవహరించే ఫోర్మన్ కమీషన్ను 5 నుంచి 7 శాతానికి పెంచాలని కూడా ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించారు.
రైళ్లలో చెరకు పళ్లాల్లో ఆహారం
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

- వీటిని ప్రయోగాత్మకంగా సీల్దా రాజధాని ఎక్స్ప్రెస్లో అమల్లోకి తెచ్చింది. అనంతరం ఇతర రైళ్లల్లో ఉపయోగించనుంది. ఒక్కో ప్లాస్టిక్ పళ్లెం ధర రూ.1-5 మధ్య ఉండగా, చెరకు పళ్లెం ధర రూ.4-8 మధ్య ఉంది.
‘నేతలు పోస్ట్ చేసిన ఫొటో’ల్లో 2017లో అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రంగా మోడి ఫొటో
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Persons in News |

కేంబ్రిడ్జ్ అనలిటికా కార్యకలాపాలు నిలిపివేత
Event-Date: | 04-May-2018 |
Level: | International |
Topic: | Science and Technology |

- ఫేస్బుక్ను ఉపయోగిస్తున్న 8.7 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా దుర్వినియోగం చేసిందని, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తనను విశ్లేషించడానికి ఈ డేటాను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.
- తమ కార్యకలాపాలను తక్షణం నిలిపివేస్తున్నామని, దివాళా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని కేంబ్రిడ్జ్ అనలిటికా తెలిపింది.
- తమ ఉద్యోగులు నైతికంగా, చట్టబద్ధంగానే పని చేసినా మీడియా చేసిన ప్రతికూల కవరేజితో తమ వినియోగదారులు, సరఫరాదారులు దూరమయ్యారని తెలిపింది.
- ఈ సంస్థ మూతబడినా డేటా ఉల్లంఘన కుంభకోణంపై తాము చేస్తున్న దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్రిటిష్ అధికారులు వెల్లడించారు.
కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి
Event-Date: | 04-May-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |

TMC-Thousand Million Cubic
విలు విద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖకు రూ.76 లక్షలు
Event-Date: | 04-May-2018 |
Level: | Local |
Topic: | Sports and Games |

ఉద్యోగుల సమస్యలపై ఈటల ఛైర్మన్గా కమిటీ
Event-Date: | 04-May-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |

- తెలంగాణలో అయిదేళ్లుగా సాధారణ బదిలీలు జరగడం లేదు. పీఆర్సీ గడువు త్వరలో ముగియనుంది. దీంతోపాటు ఏపీలో 1000 మందికిపైగా తెలంగాణ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. భాగస్వామ్య పింఛను పథకం రద్దు చేయాలని ఉద్యోగు లు కోరుతున్నారు. వీటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రమోద్ కే నాయర్కు విజిటర్స్ అవార్డు
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Awards and honours |

ప్రపంచ వాయు కాలుష్య నగరాల్లో డిల్లీకి 3వ స్థానం
Event-Date: | 04-May-2018 |
Level: | National |
Topic: | Places in News |

- గాలిలో ప్రతీ ఘనపు మీటరు(2.5 పీఎం)లో అత్యంత సూక్ష్మ ధూళి కణాలున్న పట్టణంగా కాన్పూర్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది.
- తర్వాతి స్థానంలో ఫరీదాబాద్, వారణాసి, గయ పట్టణాలున్నాయి. పట్నా, ఆగ్రా, ముజఫర్నగర్, శ్రీనగర్, గురుగ్రామ్, పాటియాలా, జోధ్పూర్లోనూ వాయుకాలుష్యం దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది.
- ప్రపంచ జనాభాలో ప్రతీ 10 మందిలో 9 మంది కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారంది. దీని కారణంగా 2016లో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మరణించారు.
- పంట వ్యర్థాలు కాల్చడం, వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కాలుష్యం, ఇళ్లల్లో వాడే ఇంధన వ్యర్థాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
- గాలిలో ప్రతీ ఘనపు మైక్రోమీటరులో 173 అత్యంత సూక్ష్మ ధూళి కణాలతో కాన్పూర్ ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో వరసగా ఫరీదాబాద్ (172), వారణాసి (151), గయ (149), పట్నా (144), డిల్లీ (143), లక్నో (138), ఆగ్రా (131), ముజఫర్పూర్ (120), శ్రీనగర్ (113) ఉన్నాయి.
ఫేస్బుక్లో ఎక్కువమంది అనుచరులున్న ప్రపంచ నాయకుడిగా నరేంద్రమోడి
Event-Date: | 04-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

- గత 14 నెలల్లో ట్రంప్ ఫేస్బుక్ పేజీపై ఎక్కువ సంభాషణలు నమోదయ్యాయి. ఆయన పేజీలో వ్యాఖ్యలు, లైక్లు, షేర్ల మొత్తం సంఖ్య 20.49 కోట్లుగా ఉంది. మోడి పేజీపై నమోదైన సంభాషణ(11.36 కోట్లు) కంటే రెట్టింపుగా ఉంది.
- ఇండోనేసియా అధ్యక్షుడు జాకో విడోడో, కాంబోడియా ప్రధాని శాండెక్ హున్ సేన్, అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మక్రి పేజీల్లోనూ వరుసగా 4.6, 3.6, 3.34 కోట్ల సంభాషణలు నమోదయ్యాయి.
- ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లో 91 శాతం (175) దేశాలకు అధికారిక ఫేస్బుక్ పేజీలున్నాయి. దీనికి అదనంగా 109 మంది దేశాధిపతులు, 86 మంది ప్రభుత్వాధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులకు వ్యక్తిగత ఫేస్బుక్ పేజీలున్నాయి.
- 2018, మార్చి 15 నాటికి ప్రపంచ నాయకులందరి ఫేస్బుక్ పేజీల్లో అనుచరుల మొత్తం సంఖ్య 30.9 కోట్లుగా ఉంది. 2017, జనవరి 1 నుంచి మొత్తంగా వీరు 5,36,644 పోస్ట్లు చేశారు. వీటిపై 90 కోట్ల సంభాషణలు నమోదయ్యాయి.
- 2017లో ఎక్కువ మంది లైక్చేసిన ఫోటోల్లో ఐదింటినీ మోడినే షేర్ చేశారు. ఒడిశాలోని ప్రఖ్యాత లింగరాజ్ దేవాలయ సందర్శన సమయంలో మోడి తీసుకున్న ఫోటో ఎక్కువ మంది మెచ్చిన ఫోటోగా రికార్డు సృష్టించింది.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నియామక బోర్డు ఏర్పాటు
Event-Date: | 04-May-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |

- గురుకులాల్లో కొత్తగా మంజూరయ్యే పోస్టులు, వాటికి సంబంధించిన నియామక ప్రకటనలు బోర్డు నుంచి వెలువడుతాయి.
- గురుకుల పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీ క్రమపద్ధతిలోకి తీసుకువచ్చినందున ఇక నియామక బాధ్యతలను సంబంధిత సొసైటీతో ఏర్పాటయ్యే ప్రత్యేక బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- గురుకుల సొసైటీల్లో అత్యంత సీనియర్ కార్యదర్శి బోర్డుకు ఛైర్మన్గా వ్యవహిస్తారని పేర్కొంది.
- బోర్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీ కార్యదర్శులు, పాఠశా విద్యాశాఖ, NCERT ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.