May-05 Current affairs articles
సాహితీ నోబెల్ వాయిదా
Event-Date: | 05-May-2018 |
Level: | International |
Topic: | Awards and honours |
.png)
2018 సంవత్సరానికి గాను సాహితీ రంగంలో నోబెల్ బహుమతి పురస్కారం వాయిదా పడింది. 1949 తర్వాత సాహిత్యంలో నోబెల్ వాయిదాపడటం ఇదే ప్రథమం. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే స్వీడిష్ కమిటీ సభ్యురాలి భర్తపై లైంగిక వేధింపు ఆరోపణలు రావటం ఈ పరిణామానికి దారి తీసింది.
- స్వీడన్ సాహితీ రంగంలో పలుకుబడి ఉన్న జీన్ క్లౌడ్ ఆర్నాల్ట్ తమపై లైంగిక వేధింపులు, అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ 18 మంది మహిళలు 2017 నవంబర్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన ‘మీ టూ ప్రచారోద్యమం’లో ఆరోపణలు చేశారు.
- కవయిత్రి, నోబెల్ సాహితీ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలు అయిన క్యాథరినా ఫ్రోస్టెన్సన్ భర్తే ఆర్నాల్ట్.
- విజేత పేర్లను ముందే చెప్పేస్తున్నారని కొందరు కమిటీ సభ్యులపై ఆరోపణలొచ్చాయి.
- అలజడి రేపిన ఈ పరిణామాలు ఎంపిక కమిటీలో విభేదాలకు ఆజ్యం పోసింది. దీంతో కమిటీ శాశ్వత కార్యదర్శి డేరియస్తోపాటు ఆరుగురు సభ్యులు రాజీనామా చేశారు.
- ఆహారధాన్యాలకు అదనపు బలవర్ధకాల జోడింపునకు 3 జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Govt Schemes and Programmes - ఆంధ్రప్రదేశ్లో 108 ఉద్యోగుల వేతనాలు పెంపు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Govt Schemes and Programmes - సహలాపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Event-Date: 05-May-2018 Level: Local Topic: Persons in News
- NTPC రీజినల్ ఈడీగా దిలీప్ కుమార్
Event-Date: 05-May-2018 Level: National Topic: Persons in News
- NTPC ఛైర్మన్ - గురుదీప్సింగ్
అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్ పర్సన్గా క్రిష్ ఐయ్యర్
Event-Date: 05-May-2018 Level: International Topic: Persons in News
- హైసియా ప్రెసిడెంట్గా మురళి బొళ్లు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Persons in News
- 3 ఆస్పత్రులకు డయాలసిస్ యూనిట్లు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Govt Schemes and Programmes
- టీటీడీ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా రాఘవేంద్రరావు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Persons in News
- ఉభయ కొరియాల్లో ఒక్కటే టైం
Event-Date: 05-May-2018 Level: International Topic: Govt Schemes and Programmes
- వెయిట్ లిఫ్టర్ పూనమ్ యాదవ్పై సస్పెన్షన్ వేటు
Event-Date: 05-May-2018 Level: National Topic: Sports and Games
- మానవ చరిత్రలో తొలిసారి 410 PPMను దాటిన కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల స్థాయి
Event-Date: 05-May-2018 Level: International Topic: Science and Technology
- ఈ వాయువుల స్థాయిని లెక్కలు తీయడం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇది 30 శాతం పెరుగుదల. 1958లో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి 315 మేర ఉంది. పారిశ్రామిక విప్లవం ఆరంభ సమయంలో 280 PPM మాత్రమే ఉంది. 2013లో తొలిసారిగా 400 PPM స్థాయిని దాటింది.
- దానికన్నా ముందు గత 8లక్ష సంవత్సరాల్లో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ఎన్నడూ 300 PPM దాటలేదు.
- చరిత్రలో 410 కన్నా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ఉన్నప్పుడు ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని, సముద్ర మట్టాలు ప్రస్తుతం కన్నా 66 అడుగుల మేర ఎక్కువగా ఉండేవని సముద్ర అవక్షేపం తదితరాల నుంచి సేకరించిన డేటా స్పష్టం చేస్తోంది.
- ప్రస్తుత పోకడ ఇదేరీతిలో కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి 450 నుంచి 500 PPM స్థాయికి చేరుకుంటుంది. దీనివల్ల వినాశకర పరిణామాలు తప్పవు. మంచు ఫలకాలు వేగంగా కరిగి, సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతాయి. మనం సమర్థంగా సర్దుబాటు చేసుకోగలిగే స్థాయి కన్నా వేగంగా ఈ పెరుగుదల ఉంటుంది.
- దీర్ఘకాల భూతాపం మొత్తం మానవ చర్యల కారణంగానే జరుగుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
- ప్రధానంగా దహనచర్య (కంబషన్) కారణంగా కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతోంది. మనం వినియోగించే శక్తిలో ఎక్కువ భాగం ఈ రసాయన చర్య ద్వారానే ఉత్పత్తవుతోంది. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి భారీ స్థాయిలో మానవులు భారీగా దహనచర్యను సాగిస్తున్నారు. ఈ అదనపు కార్బన్ డైఆక్సైడ్ గాల్లోనే పేరుకుపోయింది.
- పరమాణు నిర్మాణం కారణంగా కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్హౌస్ వాయువుగా ఉంది. భూమి నుంచి అంతరిక్షంలోకి తరలిపోయే వేడిని ఇది పట్టి ఉంచుతుంది.
- లలిత్బాబుకు జాతీయ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్
Event-Date: 05-May-2018 Level: Local Topic: Sports and Games - న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయురాలు
Event-Date: 05-May-2018 Level: International Topic: Persons in News
- 2015లో చెన్నైకు చెందిన రాజేశ్వరి అనే భారతీయురాలు క్రిమినల్ న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తిగా నియమితులైన రెండో భారతీయురాలు దీప.
- పాస్వర్డ్లు మార్చుకోండి: ట్విటర్
Event-Date: 05-May-2018 Level: International Topic: Science and Technology - తెలంగాణలో 3 జాతీయ వనరుల కేంద్రాలు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Govt Schemes and Programmes - సీఎం సహాయ నిధికి హడ్కో నగదు పురస్కారం
Event-Date: 05-May-2018 Level: Local Topic: Awards and honours
- పట్టణాల్లోని 12.5 లక్షల ఆస్తులను జియోమ్యాపింగ్ చేయడంతో పాటు ఆస్తికి సంబంధించి రెండు ఫొటోలు అందుబాటులో పెడతారు.
- ఈ ఆస్తిని భువన్ ద్వారా శాటిలైట్ సహాయంతో చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా పురపాలకశాఖ ఆస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తీసుకువచ్చారు.
- ఒక్కరూపాయి పన్ను పెంచకుండా రూ.43 కోట్ల అదనపు ఆదాయం ఆస్తిపన్ను ద్వారా సమకూరింది.
- హెచ్సీయూ ప్రొఫెసర్లకు మేధోసంపత్తి హక్కులు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Persons in News
- నానో పరిజ్ఞానంతో నీటిశుద్ధిపై ప్రయోగాలు చేస్తున్న ఈ ఇద్దరు పరిశోధించి సూక్ష్మక్రిములకు అడ్డుగా నిలిచే ఒక తెరను తయారు చేశారు.
- ఈ తెర ద్వారా మరింత నాణ్యమైన రక్షిత నీటిని అందించవచ్చని తెలుసుకున్నాక పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
- తెలంగాణ బాలల న్యాయ నిధి ఏర్పాటు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Govt Schemes and Programmes
- బాలల న్యాయ నిధి కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా బాల నేరస్థుల సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్లు ఉంటారు.
- బాలల సంరక్షణ గృహాల్లోని చిన్నారులకు ఆహ్లాద, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- బాలలకు కావాల్సిన న్యాయ సహాయం, వృత్తివిద్య, నైపుణ్య శిక్షణ, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహకారం అందిస్తారు.
- 18 ఏళ్లు నిండిన తరువాత సంరక్షణ కేంద్రాల నుంచి బయటకు వెళ్తున్నపుడు ఏకమొత్తంగా కొంత సహాయం చేస్తారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీలుగా చిన్నచిన్న వ్యాపారాలకు పెట్టుబడి సహాయం అందుతుంది.
- ప్రత్యేక పరిస్థితుల్లో తీవ్రవాద, ఇతర గ్రూపుల నుంచి సంరక్షించిన వారి పునరావాసం కోసం కొంత వెచ్చిస్తారు.
- బాలల స్నేహపూర్వక కోర్టు, పోలీస్స్టేషన్లు, బోర్డు, కమిటీలను ఏర్పాటు చేస్తారు.
- నేరాల విచారణకు హాజరయ్యే సమయంలో రవాణా భత్యం, పోలీసు సిబ్బంది సౌకర్యాలకు నిధులు ఇస్తారు.
- తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల అవసరాలు గుర్తించేలా శిక్షణ ఇవ్వడం, బాలల హక్కులు, నేరాల నిరోధానికి చర్యలపై అవగాహన కల్పిస్తారు.
- చిన్నారులపై జరిగే వేధింపులను గుర్తించేందుకు సామాజిక అవగాహన కార్యక్రమాలతో పాటు వారిని ఆదుకునేందుకు నిపుణుల సేవలు వినియోగిస్తారు.
- పాకిస్థానీ ఆషికీ అలీకి జీవితఖైదు సబబే : ఉమ్మడి హైకోర్టు
Event-Date: 05-May-2018 Level: Local Topic: Judiciary and Judgement
- డిల్లీ, కాన్పూర్ పట్టణాల పర్యాటకుడిగా ఆషికీ అలీ 2001లో భారతదేశం వచ్చాడు.
- డిల్లీ వచ్చాక పాస్పోర్టును నాశనం చేశాడు. ఆ తర్వాత పాస్పోర్టు, వీసా నిబంధనలను ఉల్లంఘించి దేశంలోని పలుప్రాంతాలకు వెళ్లాడు.
- హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెట్ ప్రాంతం, తదితర ప్రాంతాలకు సంబంధించిన వివరాల్ని సేకరించి ఈ-మెయిల్ ద్వారా పాకిస్థాన్ ఆర్మీ మిటరీ ఇంటెలిజెన్సీకి చేరవేశాడు.
- పాకిస్థానీయులతో టెలిఫోన్ బూత్వద్ద మాట్లాడుతూ 2002 జనవరిలో నిజామాబాద్లో పోలీసులకు దొరికాడు.
- ఐపీసీ 121, 121ఎ, ఫారినర్స్ చట్టం, అధికార రహస్యాల చట్టం కింద అలీపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన నిజామాబాద్ రెండో అదనపు జిల్లా/సెషన్స్ కోర్టు అలీని దోషిగా పేర్కొంటూ జీవితఖైదు విధిస్తూ 2004 అక్టోబర్లో తీర్పు చెప్పింది. అధికార రహస్యాల చట్టం భారతదేశీయులకే వర్తిస్తుందని విదేశీయుడైన అలీకి వర్తించదని విచారణ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐపీసీ, ఫారినర్స్ చట్టం కింద మాత్రమే శిక్షలు విధించింది. అధికార రహస్యాల చట్టం కింద నిర్దోషిగా ప్రకటించింది. జీవితఖైదు విధింపును సవాలు చేస్తూ అషికీ అలీ 2011లో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.
- నీసా సంచాలకులుగా అంజనాసిన్హా
Event-Date: 05-May-2018 Level: Local Topic: Persons in News
- జాతీయ పారిశ్రామిక భద్రతా దళం (CISF) బలగాలకు నీసాలో శిక్షణ ఇస్తుంటారు. హైదరాబాద్లోని హకీంపేట్లో ఈ కేంద్రం ఉంది. CISF బలగాలకు శిక్షణ ఇచ్చే కేంద్రం దేశం మొత్తం మీద ఇదొక్కటే.
- నీసాకు ఒక మహిళా అధికారి బాధ్యతలు చేపట్టడం కూడా ఇదే ప్రథమం.
CISF-Central Industrial Security Force - 2012-16 మధ్య 530 మంది జర్నలిస్టులు మృతి
Event-Date: 05-May-2018 Level: International Topic: Miscellaneous(General) - 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
Event-Date: 05-May-2018 Level: National Topic: Awards and honours - మొత్తం 141 అవార్డుల్లో కేవలం 11 అవార్డులనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందించడం, మిగతా అన్నింటినీ కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతిఇరానీ, సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాఠోడ్ చేతుల మీదుగా ప్రదానం చేయడాన్ని కళాకారులు తీవ్రంగా తప్పుబట్టారు.
- ఇప్పటివరకూ జాతీయ అవార్డు ప్రదానోత్సవాలన్నింటిలో చివరి వరకు రాష్ట్రపతి పాల్గొనడం ఆనవాయితీగా వచ్చింది. దానిని తొలిసారి మార్చారు.
- దివంగత నటుడు వినోద్ఖన్నాకు ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆయన సతీమణి కవితాఖన్నా, కుమారుడు అక్షయ్ఖన్నాకు రాష్ట్రపతి అందించారు.
- ఉత్తమనటిగా ఎంపికైన శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్, కుమార్తె జాన్వీ, ఖుషీకపూర్లు పురస్కారాన్ని అందుకున్నారు.