Type Here to Get Search Results !

May-08

May-08 Current affairs articles

రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి పుతిన్‌ ప్రమాణ స్వీకారం
Event-Date:08-May-2018
Level:International
Topic:Persons in News
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ (65) 2018 మే 7న నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పటికే దాదాపు ఇరవై ఏళ్లుగా ఆయన ఈ హోదాలో ఉన్నారు. తాజా ఎన్నికతో మరో 6 సం॥లు అధ్యక్షునిగా కొనసాగుతారు. రాజ్యాంగాన్ని చేతపట్టి ప్రమాణం చేసిన ఆయన రష్యా భవితవ్యం కోసం చేయగలిగిందంతా చేస్తానని వాగ్దానం చేశారు. దీర్ఘకాలం పాటు రష్యాను పాలించిన నేతగా జోసెఫ్‌ స్టాలిన్‌ పేరిట ఉన్న రికార్డును పుతిన్‌ తిరగరాసే అవకాశాలున్నాయి.  2018 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు దాదాపు 77% ఓట్లు లభించాయి. 
  • పుతిన్‌ లెనిన్‌గ్రాడ్‌ (ప్రస్తుత సెయింట్‌పీటర్స్‌బర్స్‌)లో 1952 అక్టోబర్‌ 7న ఒక కార్మికుని కుటుంబంలో జన్మించారు. గూఢచారిగా ఉండాలనే చిన్ననాటి కలను నెరవేర్చుకునేలా 1985లో కేజీబీలో పుతిన్‌ చేరారు.
  • 1996లో రష్యాకు బోరిస్‌ ఎల్సిన్‌ అధ్యక్షునిగా ఉన్నప్పుడు క్రెమ్లిన్‌లో పనిచేయడానికి మాస్కోకు రావాల్సిందిగా పిలుపు అందింది. రెండేళ్లలోనే ఆయన కేజీబీ సారధి అయ్యారు. అ
  • నారోగ్యంతో సతమతమవుతున్న ఎల్సిన్‌ 1999 ఆగస్టులో పుతిన్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. చెచెన్యా ప్రాంతంలో తిరుగుబాటుదారుల్ని అణిచివేయడానికి చేసిన యుద్ధంతో పుతిన్‌కు ప్రజాదరణ ఒక్కసారిగా పెరిగింది.
  • ఎల్సిన్‌ రాజీనామా చేశాక పుతిన్‌ రష్యా అధ్యక్షుడయ్యారు. మూడేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2013లో భార్య లిడ్మిలాకు ఆయన విడాకులిచ్చారు.
  • 2008లో అధ్యక్ష పగ్గాలను తన అనుయాయుడైన ద్మిత్రి మెద్వెదేవ్‌కు అప్పగించి, పుతిన్‌ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో మళ్లీ అధ్యక్షుడయ్యారు.
  • ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతగా ఫోర్బ్స్‌ జాబితాలో గత నాలుగేళ్లుగా పుతిన్‌ పేరే కొనసాగుతోంది. 

-------------------------------------------------------------------------------------------

సివిల్ప్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ అనుదీప్‌కు తెలంగాణ సీఎం ఆశీస్సులు 
Event-Date:08-May-2018
Level:Local
Topic:Persons in News
సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో ప్రథమ ర్యాంక్‌ సాధించిన దురిశెట్టి అనుదీప్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులు అందజేశారు. 2018 మే 7న దురిశెట్టి అనుదీప్‌ తన తల్లిదండ్రులు  మనోహర్‌, జ్యోతితో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనుదీప్‌ను సీఎం ఆలింగనం చేసుకుని అభినందించారు. అతని తల్లిదండ్రులను కొనియాడారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం
మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమాన్ని 2018 మే 7న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ప్రధాన కూడళ్ల నుంచి ప్రారంభమైన ర్యాలీల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, జేసీ, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆడబిడ్డపై అత్యాచారాలను ఖండిస్తూ, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభల్లో ఆడ బిడ్డకు రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
  • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వరకు (2.5కి.మీ దూరం) నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. పలువురు మహిళలు సీఎం వెంట కలిసి నడిచారు.
  • అత్యాచార ఘటనల నివారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.
  • చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ర్యాలీలు, సభలు నిర్వహించలేదు.
  •  ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం చేపట్టడంపై బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

ఫిక్కీ ‘సంఘటిత రంగంలో స్త్రీ-పురుష సమానత్వ సూచిక’
ఫిక్కీ మహిళా విభాగం రూపొందించిన ‘సంఘటిత రంగంలో స్త్రీ-పురుష సమానత్వ సూచిక’ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూడిల్లీలో 2018 మే 7న విడుదల చేశారు. 
  • ఫిక్కీ మహిళా విభాగం అధ్యక్షురాలు - పింకీరెడ్డి 

జయలలిత స్మారక మందిరానికి శంకుస్థాపన 
Event-Date:08-May-2018
Level:National
Topic:Places in News
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి ఉన్న ప్రాంతంలో స్మారక మందిరం నిర్మాణానికి 2018 మే 7న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌స్వెల్వం శంకుస్థాపన చేశారు. జయలలిత సమాధి ఉన్న చెన్నైలోని మెరీనా తీరంలో రూ.50.80 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. 

కథువా కేసు పఠాన్‌కోట్‌కు బదిలీ
జమ్మూకశ్మీర్‌లోని కథువాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు మార్చాలని సుప్రీం కోర్టు 2018 మే 7న ఆదేశించింది. ‘‘భయోత్పాతం, నిష్పాక్షిక విచారణ ఏకకాలంలో సాగవు’’ అని వ్యాఖ్యానించింది.
  • విచారణ రోజువారీగా, రహస్యంగా జరగాలని పేర్కొంది. పఠాన్‌కోట్‌లోని జిల్లా సెషన్స్‌ జడ్జి దీన్ని ప్రత్యక్షంగా చేపట్టాలని ఆదేశించింది. తమకు బెదిరింపులు వస్తున్నందు వల్ల కేసు విచారణను చండీగఢ్‌కు బదిలీ చేయాని బాధితురాలి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
  • కేసు విచారణపై విధించిన స్టేను కూడా ఎత్తివేసింది. కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణ బాధ్యతను మరే ఇతర సెషన్స్‌ న్యాయమూర్తులకు అప్పగించరాదని పఠాన్‌కోట్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జీని ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పిటిషన్లను ఏ కోర్టూ చేపట్టరాదని స్పష్టం చేసింది. 

ఐఎస్‌ ఉగ్రవాదుల అనుసంధానంగా ఫేస్‌బుక్‌
వేలమంది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులను దగ్గర చేసేందుకు వారధిలా పనిచేసినట్లు ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ‘‘సజెస్టెడ్‌ ఫ్రెండ్స్‌’’ పేరుతో ఫేస్‌బుక్‌ వినియోగదారులకు అందిస్తున్న సేవలు ఉగ్రవాదులకు చక్కగా తోడ్పడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఉగ్రవాద నిరోధక ప్రాజెక్టు (సీఈపీ) దీన్ని చేపట్టింది. 96

  • దేశాల్లోని 1000 మంది ఐఎస్‌ ఉగ్రవాదుల ఫేస్‌బుక్‌ వినియోగాన్ని సంస్థ విశ్లేషించింది.‘‘సజెస్టెడ్‌ ఫ్రెండ్స్‌’’ సదుపాయంపై దృష్టిసారించింది.
  • ఒకేలాంటి అభిరుచులు ఉండేవారిని దగ్గర చేసే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టింది. అయితే కొందరు ఉగ్రవాదుల పేజీను పరిశీలించిన అనంతరం మరింత మంది ఉగ్రవాదుల పేజీలను చూపించేందుకు ఈ సాంకేతికత తోడ్పడుతోందని సీఈపీ పరిశోధకులు తెలిపారు. అతివాద భావజాలం ఉండేవారిని ఉగ్రవాదంలోకి లాగేందుకూ ఇది సహకరిస్తోందని వివరించారు.
  • ఇటీవల 8.7 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వివాదం ఫేస్‌బుక్‌ను కుదిపేసింది. అప్పటినుంచీ ఫేస్‌బుక్‌ విశ్వసనీయతపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

202 రంగులున్నచీర రూపొందించిన  సిరిసిల్ల చేనేత కార్మికుడు 
Event-Date:08-May-2018
Level:Local
Topic:Persons in News
తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌ అద్భుతం సృష్టించారు. 202 రంగులు గల కాటన్‌, పాలిస్టర్‌ చీరను మరమగ్గంపై నేశారు. 5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు, 400 గ్రాముల బరువుతో దీన్ని తయారుచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. బెంగళూర్‌కు చెందిన వ్యాపారవేత్త వినయ్‌ ఆర్డర్‌పై తయారు చేశాడు. ఈ చీర నేయడానికి 15 రోజులు పట్టింది. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను విజయ్‌ తయారు చేశారు. 

దేశికోత్తమ పురస్కారానికి అమితాబ్‌ పేరు ప్రతిపాదన
Event-Date:08-May-2018
Level:National
Topic:Awards and honours
విశ్వభారతి విశ్వవిద్యాలయం దేశికోత్తమ పురస్కారానికి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ పేరును ప్రతిపాదించింది. ఆయనతో పాటు ప్రఖ్యాత కవి గుల్జార్‌, రచయితలు అమితవ్‌ఘోష్‌, సునితి కుమార్‌ పాఠక్‌ తదితరుల పేర్లను నామినేట్‌ చేశారు. 

భారత్‌లో బీటీ పత్తి విత్తనాల పేటెంట్‌ హక్కులపై మాన్‌శాంటో వినతికి సుప్రీం తిరస్కరణ
భారత్‌లో బీటీ పత్తి విత్తనాలపై తమ పేటెంట్‌ హక్కులు కొనసాగించాలని అమెరికాకు చెందిన మాన్‌శాంటో కంపెనీ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలపలేదు. ఈ కంపెనీ ఇదే విజ్ఞప్తిపై గతంలో డిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆ న్యాయస్థానం తిరస్కరించింది. డిల్లీ హైకోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరగా,  సానుకూలత వ్యక్తం చేయలేదు.  

కేంద్ర కార్యాలయాల్లోకి మాజీ ఎంపీల ప్రవేశంపై నియంత్రణ
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోకి మాజీ ఎంపీల ప్రవేశంపై డిల్లీలో నియంత్రణ విధించారు. ఇదివరకు ఎంపీలు, మాజీ ఎంపీలు ఐడీ కార్డు చూపించి కేంద్ర ప్రభుత్వ అధికారుల వద్దకు నేరుగా వెళ్లడానికి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు మాజీ ఎంపీలు ఏ పనిపై వచ్చిందీ చెప్పాలి. ఏ అధికారిని కలవాలనుకుంటున్నారో ఆయన అనుమతి తీసుకుంటేనే లోపలికి పంపిస్తున్నారు  
రాజ్యసభ నిబంధనల పునఃపరిశీలనకు వీకే అగ్నిహోత్రి కమిటీ
Event-Date:08-May-2018
Level:National
Topic:Persons in News
రాజ్యసభ తరచూ వాయిదాలు పడకుండా కార్యకలాపాలు మరింత మెరుగ్గా, సజావుగా కొనసాగేలా నిబంధనల పునఃపరిశీలనకు ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్‌ వీకే అగ్నిహోత్రి నేతృత్వంలో న్యాయశాఖ రిటైర్డ్‌ సంయుక్త కార్యదర్శి ఎస్‌.ఆర్‌.ధలేతాతో కూడిన కమిటీ వివిధ అంశాలను సమీక్షిస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ దేశ్‌ దీపక్‌ వర్మ వెల్లడించారు.  
కేబినెట్‌ కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు
Event-Date:08-May-2018
Level:National
Topic:Persons in News
కేబినెట్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ సిన్హా (62) పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు 2018 మే 7న అధికారిక ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన గల నియామకాల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఆయన 2019 జూన్‌ 12 వరకు పదవిలో కొనసాగనున్నారు. మొదట 2015లో నిర్ణీత రెండేళ్ల పదవీ కాలానికి కేబినెట్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం ఒకసారి పదవీ కాలాన్ని పొడిగించారు. 1977 బ్యాచ్‌కు చెందిన సిన్హా ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌ అధికారి. 





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.