Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 సదస్సులు-సమావేశాలు

ఏప్రిల్ - 5
¤ అజర్‌బైజాన్ రాజధాని బాకూలో అలీనోద్యమ (ఎన్ఏఎం) దేశాల 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు.
          »
 ప్రపంచ శాంతికి, భద్రతకు ఉగ్రవాదం పెనుముప్పులా పరిణమించిందని సుష్మా పునరుద్ఘాటించారు.
ఏప్రిల్ - 10
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తొలి 'ఆనంద నగరాల' సదస్సును మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ప్రారంభించారు.          » 80 దేశాలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగర ప్రణాళిక నిపుణులు, ఆర్కిటెక్ట్‌లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులు హాజరయ్యారు.          » వర్ధమాన దేశాల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటికి వినూత్న పరిష్కారాలు, నవ్య ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తారు.          » అమరావతి నగర బృహత్తర ప్రణాళిక, ఆకృతికి ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) 'గ్రీన్ సిటీ ప్లాటినమ్' పురస్కారం దక్కింది.¤ దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సును కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సదస్సును ప్రారంభించారు.          » రాష్ట్రాలకు నిధులు బదలాయించడానికి రూపొందించిన పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాలు వివక్షపూరితమని మూడు దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించాయి. వీటిని వెంటనే రద్దు చేసి కొత్త విధివిధానాలు రూపొందించాలని డిమాండ్ చేశాయి.          » ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేరళ ఆర్థిక మంత్రి టి.ఎం.థామస్, కర్ణాటక తరఫున ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ సామి కూడా హాజరయ్యారు.          » ఈ సదస్సుకు తెలంగాణ, తమిళనాడు హాజరుకాలేదు.
ఏప్రిల్ - 11
¤ 16వ అంతర్జాతీయ ఇంధన సదస్సు (ఐఈఎఫ్) మంత్రివర్గ సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు.          » ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఇంధనాన్ని అందరికీ అందుబాటు ధరలోకి తీసుకురావాలంటే బాధ్యతాయుత ధరలపై అంతర్జాతీయ ఏకాభిప్రాయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు.
ఏప్రిల్ - 17
¤ బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆధ్వర్యంలో జీఎస్టీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు.
ఏప్రిల్ - 19
¤ రెండో ఎలిజబెత్ రాణి ఛోగమ్ సదస్సును లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రారంభించారు.          » ఛోగమ్‌లో సభ్యత్వం ఉన్న 53 దేశాల నుంచి నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.          » కామన్వెల్త్ దేశాల కూటమికి అధినేతగా తన స్థానంలో యువరాజు ఛార్లెస్‌ను వారసుడిగా నియమించాల్సిందిగా రాణి విజ్ఞప్తి చేశారు. నిజానికి కామన్వెల్త్ కూటమి అధినాయకత్వం వారసత్వ పదవి కాదు. రాణి తదనంతరం ఛార్లెస్ (69) నేరుగా ఈ పదవిని చేపట్టే అవకాశం లేదు.
ఏప్రిల్ - 20
¤ లండన్‌లోని విండ్‌సర్ కోటలో రెండు రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ దేశాధినేతల (ఛోగమ్) సదస్సు ముగిసింది.          » రహస్యంగా జరిగిన ఈ భేటీలో కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ ఛార్లెస్ (69) నియామకానికి 53 దేశాల అధినేతలు ఆమోదముద్ర వేశారు.          » ఛార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజిబెత్ నుంచి కామన్వెల్త్ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు. ప్రధాని మోదీ సహా పలు దేశాధినేతలంతా తమ సహాయకులెవరూ లేకుండానే సదస్సులో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.