¤ సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ, లోపాలపై సమీక్షించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. » లీక్ తదితర లోపాలు లేకుండా సాంకేతికత సాయంతో భద్రమైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ కమిటీ తగు సూచనలు చేయనుంది. » ఈ ఏడుగురు సభ్యుల కమిటీకి హెచ్ఆర్డీ మాజీ కార్యదర్శి వినయ్శీల్ ఒబెరాయ్ నేతృత్వం వహిస్తారు. మే 31 కల్లా ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేస్తుంది.