అక్షరాస్యత
* విద్య, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని మానవ వనరులుగా చెప్పవచ్చు.
* మానవ వనరుల నాణ్యతలో పెరుగుదల.. విద్య, వైద్యం, నైపుణ్యం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
మానవ వనరుల అభివృద్ధి - ప్రాధాన్యం
* ఆర్థికాభివృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి ముఖ్యపాత్రను పోషిస్తుంది.* భౌతిక మూలధనం సమర్థంగా, అభిలషణీయంగా ఉపయోగించడం మానవ వనరుల సమర్థ వినియోగంపై ఆధారపడి ఉంటుంది.
* ఆదాయాలు, సంపద సృష్టి, సమర్థవంతమైన సాంకేతిక సృష్టి, వినియోగం, వాటి అభివృద్ధి.. ఇవన్నీ మానవ వనరుల వల్లే సాధ్యమవుతాయి.
* వనరుల సమర్థ వినియోగాన్ని సాంకేతిక, వృత్తి, పాలనా సంబంధ నైపుణ్యాలు ఉండే మానవ వనరులే నిర్వహిస్తాయి. తద్వారా అభివృద్ధి సాధ్యపడుతుంది.
మానవ వనరుల అభివృద్ధి చర్యలు (థియోడర్ డబ్ల్యూ షుల్జ్)
* ప్రజల ఆయుర్దాయం, శక్తి, సమర్థత, ఆరోగ్యం, సేవలు వంటి అంశాలపై చేసే వ్యయాలు* పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ సదుపాయాలు
* ప్రాథమిక, ద్వితీయ, ఉన్నత, పరిశోధన, అభివృద్ధి విద్య స్థితులు
* వ్యవసాయ రంగ అభివృద్ధి, విస్తరణ కార్యకలాపాలు, సంస్థలు అమలు చేయని వయోజన విద్యా పథకాలు
* ఉద్యోగావకాశాలకు అనుగుణంగా సర్దుబాటుకు వ్యక్తులు, కుటుంబాల వలసలు
* మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఈ రెండు ప్రక్రియలూ పరస్పరం ఆధారపడి, ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తుంటాయి.
విద్యతో ప్రయోజనాలు
* మానవ వనరుల అభివృద్ధికి విద్య అత్యధికంగా దోహదం చేస్తుంది.* విద్యపై పెట్టుబడి ఆర్థికాభివృద్ధిని అత్యున్నత స్థాయికి తీసుకువెళుతుంది.
* ఉద్యోగ, ఆదాయ/సంపాదన అవకాశాలను విద్య పెంచుతుంది. దాంతో ఆదాయ సమానతలు కూడా పెరుగుతాయి.
* సంపూర్ణ విద్యాపరిస్థితులు ప్రజా సామర్థ్యాన్ని పెంచుతాయి.
* గ్రామీణ ప్రాంతాల అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను విద్య తొలగిస్తుంది.
* నైపుణ్యాలతోపాటు ఆధునిక దృక్పథాన్ని పెంచుతుంది.
* వ్యవసాయదారులు అక్షరాస్యులయితే నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచగలుగుతారు.
* చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే నైపుణ్యాలను విద్య ద్వారా పొంది నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలు తగ్గించవచ్చు.
ముఖ్యాంశాలు
* తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత ఉన్న జిల్లా హైదరాబాద్.* అక్షరాస్యతలో రెండో స్థానం రంగారెడ్డి జిల్లా.
* అతి తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా మహబూబ్నగర్.
* తెలంగాణలో పురుషుల్లో అక్షరాస్యత శాతం అత్యధికంగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో ఉన్న జిల్లా మహబూబ్నగర్.
* స్త్రీలలో అక్షరాస్యత శాతం అత్యధికంగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో మహబూబ్నగర్ జిల్లా ఉంది.
* తెలంగాణలో పట్టణ అక్షరాస్యత అత్యధికంగా ఉన్న మొదటి మూడు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ.
* అతి తక్కువ పట్టణ అక్షరాస్యత ఉన్న జిల్లాలు వరుసగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్.
* తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత అత్యధికంగా ఉన్న మొదటి మూడు జిల్లాలు వరుసగా రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం. అతి తక్కువగా ఉన్న జిల్లాలు వరుసగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్.
మాదిరి ప్రశ్నలు
1. 'మానవ ఉత్పాదక శక్తిని పెంచే ఏ చర్య అయినా మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది..' అని తెలిపింది ఎవరు?ఎ) ఛార్లెస్ షుల్జ్ బి) మైకేల్ వ్రాడారో సి) థియోడర్ డబ్ల్యూ.షుల్జ్ డి) అందరూ
జ: (సి)
2. తెలంగాణలో అక్షరాస్యత శాతం ఎంత?
ఎ) 66.46% బి) 20.34% సి) 48.34% డి) 61.76%
జ: (ఎ)
3. అత్యధిక పట్టణ అక్షరాస్యత ఉన్న జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్ బి) హైదరాబాద్ సి) కరీంనగర్ డి) వరంగల్
జ: (బి)
4. అత్యల్ప ఎస్సీ అక్షరాస్యత ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్నగర్ బి) వరంగల్ సి) ఖమ్మం డి) హైదరాబాద్
జ: (ఎ)
5. గ్రామీణ అక్షరాస్యత శూన్యంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్ బి) ఖమ్మం సి) వరంగల్ డి) రంగారెడ్డి
జ: (ఎ)
Posted on 12-10-2015
దాసరి రాజేందర్